Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిడిఆర్పి ప్రాజెక్టు పనులన్నీ డిశంబరులోగా పూర్తి చేయండి: సిఎస్

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఎపిడిఆర్పి) కు సంబంధించి 4వ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ(SSC) సమావేశం  విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ... ఎపి డిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులన్నిటినీ యుధ్ధ ప్రాతిపదికన చేపట్టి ఈఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.

ప్రపంచ బ్యాంకు సహాయం, మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి సుమారు 1773కోట్ల రూ.ల అంచనాలతో శ్రీకాకుళం నుండి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఎపి డిఆర్పి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు.

వాస్తవానికి ఈపనులన్నీ 2015-2020 ల మధ్య ఐదేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉందని అయితే కరోనా తదితర కారణాల వల్ల పనులు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు.దానివల్ల ఈప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈఏడాది వరకూ గడువును పెంచినందున ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు లోగా పనులన్నీ పూర్తి కావాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధికారులను ఆదేశించారు.
 
ఈసమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండాలోని అంశాలను వివరించారు. ఇప్పటి వరకూ 1452 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 73శాతం ఫిజికల్ ప్రోగ్రస్ ను,71శాతం ఫైనాన్సియల్ ప్రోగ్రస్ ను సాధించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments