పీకకోసి చంపేస్తారట : కమెడియన్ వేణుమాధవ్ ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని సినీ నటి రోజా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించిన టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌కు బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (07:07 IST)
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని సినీ నటి రోజా, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించిన టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌కు బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆయన కర్నూలు రెండో పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. 
 
నంద్యాలలో టీడీపీ తరపున ప్రచారం చేసినందుకు తనను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఈ పని వైసీపీ వాళ్లే చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పీకకోసి చంపేస్తారమంటూ బెదిరింపులు వచ్చాయని ఆయన పేర్కొనడం గమనార్హం. 
 
నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో కొన్ని రోజులుగా పాల్గొంటున్న వేణుమాధవ్.. వైసీపీ తీరుపై, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేయడం తెలిసిందే. 'రోజా' అంటే 'రో' యహాసే 'జా' (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని, టాటూలు వేసుకుని, చిన్నచిన్న డ్రస్సులు వేసుకుని, డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని... అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని ఇటీవల వ్యాఖ్యానించాడు. 
 
అలాగే, తనకు టీవీ, పేపర్ లేవంటూ తనకు తన తండ్రి వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తిపాస్తులు ప్రజలేనని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేణు మాధవ్ తీవ్రంగానే స్పందించారు. ఆ పేపర్.. ఆ టీవీ చానెల్ ఎవరిది బట్టేబాజ్ అంటూ ప్రశ్నించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments