Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజా ఎవరో నాకు తెలియదు.. భూమా ఫ్యామిలీతో చిరు-పవన్‌లకు సంబంధాలున్నాయ్: వేణు మాధవ్

సినీ హాస్య నటుడు వేణు మాధవ్ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో దిగారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ప్రచారం చేశారు. సినీ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వేణు మాధవ్‌ను తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికల ప

రోజా ఎవరో నాకు తెలియదు.. భూమా ఫ్యామిలీతో చిరు-పవన్‌లకు సంబంధాలున్నాయ్: వేణు మాధవ్
, శుక్రవారం, 18 ఆగస్టు 2017 (17:01 IST)
సినీ హాస్య నటుడు వేణు మాధవ్ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో దిగారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ప్రచారం చేశారు. సినీ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వేణు మాధవ్‌ను తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో దించితే ఆయనకు పాపులారిటీ వస్తుందని ఆశించినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ ఆశించినట్లే వేణు మాధవ్ ఎన్నికల ప్రచారం పార్టీకి కాస్త బూస్టునిచ్చింది. 
 
వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటి రోజాకు కౌంటరిచ్చేందుకు వేణు మాధవ్ రంగంలోకి దిగారని టాక్ వస్తోంది. మొన్నటికి మొన్న ఎన్నికల ప్రచారంలో తన బిడ్డకు సమానమైన భూమా అఖిలప్రియపై కామెంట్ చేసిన ఆమె (రోజా) ఎవరు? ఆమె ఏం చేస్తుందటి? అంటూ సెటైర్లు విసిరిన వేణు మాధవ్.. మళ్లీ రోజాను తేలిగ్గా తీసిపారేశారు. రోజా ఎవరో తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. 
 
చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని.. డ్యాన్సులు చేసే రోజానా అఖిల ప్రియ గురించి మాట్లాడేది అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయిన వేణు మాధవ్.. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... రోజాకు కౌంటర్ ఇచ్చేందుకే మిమ్మల్ని టీడీపీ అధిష్ఠానం రంగంలో దింపిందనే కామెంట్స్ వస్తున్నాయి? అని ప్రశ్నించగా.. ఆమె ఎవరో నాకు తెలియదు.. సారీ అంటూ బదులిచ్చారు. 
 
తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మహానటుడు ఎన్టీఆర్ వద్ద, టీడీపీ ఆఫీసులో పనిచేసేవాడిని. కాబట్టి, టీడీపీతో, నందమూరి కుటుంబంతో తనకు అనుబంధం వుందని చెప్పారు. ఆ అనుబంధం కారణంగానే నంద్యాల ఎన్నికల ప్రచారంలో దిగానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడికి పెళ్ళైపోయింది.. ప్రేయసి నెయిల్ పాలిష్ రిమూవర్ తాగేసింది.. కొత్త పెళ్ళికొడుకు జంప్