వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - రాత్రికి రాజమండ్రిలోనే బస

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళ, బుధవారాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోనసీమ జిల్లా మీదుగా ప్రారంభమైంది. సీఎం పర్యటనకు సంబంధించి టూర్ షెడ్యూల్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ పర్యటన కోసం సీఎం జగన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం పెదపూడికి సీఎం చేరుకున్నారు. అక్కడికి సమీపంలోని పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులతో జగన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత అలిగేవారిపేటకు చెందిన వరద బాధితులను కలుసుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఊడిమూడిలంకలోని వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు. 
 
ఆ తర్వాత అదే మండల పరిధిలోని వాడ్రేవుపల్లికి మధ్యాహ్నం 2.05 గంటలకు ఆయన చేరుకుంటారు. అక్కడ నుంచి రాజోలు మండలం మేకలపాలెంకు వెళతారు. ఆ తర్వాత సయంత్రం 4.05 గంటలకు రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రి అతిథి గృహంలో వరదలపై ఉన్నతాధికారులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష తర్వాత సీఎం అక్కడే బస చేసి, బుధవారం మరికొన్ని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments