Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 12వ తేదీన విద్యాకానుక పంపిణీ : మంత్రి బొత్స

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (17:51 IST)
వేసవి సెలవులు తర్వాత ఏపీలో ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభంకానున్నాయి. అదేరోజున విద్యార్థులకు జగనన్న విద్యా కానుకకు సంబంధించిన విద్యా కిట్లను ప్రదానం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒక్కో విద్యార్థికి రూ.2500 విలువైన విద్యా కానుక కిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులోని క్రోసూరలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్లను ప్రదానం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 40 లక్షల మంది ఈ కిట్లను అందజేస్తామని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రోత్సాహకాలను సీఎం అందజేస్తారన్నారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా అమ్మఒడి కార్యక్రమం జరుగుతుందన్నారు. 
 
టెన్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరలా అదే తరగతిలో రెగ్యులర్‌గా చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments