Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రైతులను నిలువునా ముంచేసిన నివర్ తుఫాన్, 2 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (13:15 IST)
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 2,14,420 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశకు వచ్చిన వరి పంట నీట మునిగిపోయింది. చేతికి అందివచ్చిన మినుము ఇతర మెట్ట పంటలు వర్షపు నీటిలో మునిగిపోయాయి.
 
ఒక్క గుంటూరు జిల్లాలోనే లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల హెక్టార్లలో మినుము దెబ్బతింది. ప్రకాశం జిల్లాలో 3వేల 650 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 11 జిల్లాల్లో 1,89,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది.
నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో శనివారం నాడు ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసిన అనంతరం రేణిగుంటలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొని పంట నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments