Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ వైర్లు తెగిన ఘటనపై ఏడీఈ, ఏఈ‌, లైన్ ఇన్‌స్పెక్టర్‌పై వేటు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:31 IST)
అనంతపురం జిల్లాలో విద్యుత్ వైర్లు తెగి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావించి ఏడీఈ, ఏఈ, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై వేటు వేసింది. అలాగే, ఘటనకు సంబందించిన సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ డైరెక్టర్‌ను ఆదేశించింది. 
 
కాగా జిల్లాలోని బొమ్మనహాల్ మండలం, దర్గాహోన్నూరులో పంట కోత పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతంతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఈ ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
 
ఈ వ్యవసాయ కూలీలు పంట కోస్తుండగా వర్షం కురవడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ట్రాక్టర్‌లో ఎక్కారు. ఆ సమయంలో 33 కేవీ విద్యుత్ మెయిన్‌ లైన్ తీగలు తెగి వారిపై పడటంతో ఆరుగురు కూలీలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments