Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బృందంతో నేడు భేటీ కానున్న సీఎం జగన్, వరద ప్రభావిత ప్రాంతాలపై ఆరా

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:53 IST)
ఏపీ సీఎం జగన్ నేడు కేంద్ర బృందంతో భేటీ కానున్నారు. ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రెండు రోజులపాటు పరిశీలించిన కేంద్ర బృందం ఈ రోజు ఉదయం 11 గంటల30 నిమిషాలకు సీఎంను కలవనున్నారు. వరద నష్టంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎస్ 6వేల 386 కోట్లు నష్టం సంభవించినట్లు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు.
 
తాత్కాలిక సహాయక చర్యల కోసం 840 కోట్లు అవసరం కాగా శాస్వత పునరుద్దరణ చర్యకు 4 వేల 439 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా 2 లక్షల 12 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, వీటి ద్వారా 903 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు.
 
అలాగే 24 వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని దీనికోసం 483 కోట్లు నష్టం ఏర్పడిందని తెలిపారు. తక్షణ సాయం, తడి ధాన్యం కొనుగోలుపై సడలింపు ఇవ్వాలని కేంద్ర బృందానికి సీఎం జగన్ కోరనున్నారు. అయితే వరద కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యడానికి ఆదుకోవాలని ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments