నేడు సీఎం జగన్ రెండు జిల్లాల్లో పర్యటన

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదివారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. వీటిలో ఒకటి తన సొంత జిల్లా కడప ఒకటి. అలాగే, విశాఖలో కూడా ఆయన పర్యటిస్తారు. ఈ రెండు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన కడప జిల్లాకు వెళతారు. ఉదయం 11 గంటలకు కడపకు చేరుకునే సీఎం జగన్... అక్కడ  పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కడప జయరాజా గార్డెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత సాయంత్రం విశాఖ జిల్లా పర్యటనకు వెళతారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకునే సీఎం జగన్ అక్కడ నుంచి నేవల్ ఎయిర్‌‍స్టేషన్, ఐఎన్ఎస్ డే గా వద్ద భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. విశాఖలో తన పర్యటన ముగించుకుని రాత్రి 7 గంటల సమయంలో తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, విశాఖకు రాష్ట్రపతి రానుండటంతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments