మేనిఫెస్టో మొత్తం చేస్తున్నా; జ‌గ‌న్; ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు; చంద్ర‌బాబు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (18:12 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అపుడే సాధారణ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చెప్పిందంతా చేసేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెపుతున్నారు. వాటికి మూడు రెట్లు ప్ర‌జ‌ల‌పై భారం వేస్తున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు.
 
 
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ‘‘అధికారంలోకి రాగానే పింఛన్‌ ₹2,250కి పెంచాం. రెండున్నరేళ్లలో ఇవాళ ₹2,500కు పింఛన్‌ పెంచుతున్నాం. మధ్యాహ్నం నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ అందిస్తారు. ఎవరైనా.. మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను. మంచి చేస్తుంటే విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. విమర్శించేవాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించట్లేదా? పింఛన్‌ ₹3వేలకు పెంచుతామన్న మాట నిలబెట్టుకుంటాం’’ అని జగన్‌ తెలిపారు.
 
 
ఏపీలో వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్‌ అడిగిన ఒక్క అవకాశం ప్రజలిచ్చారని.. వారి భ్రమలు తొలగిపోయాయన్నారు. సంక్షేమం కింద ఇచ్చేదాని కంటే ప్రజలపై మోపే భారం 3 రెట్లు ఎక్కువని ఆరోపించారు. ఆదాయం, ఖర్చును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. వివిధ సంస్థల విశ్వసనీయత, బ్రాండ్‌ ఇమేజ్‌ను సీఎం దెబ్బతీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments