డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే కి సీఎం జగన్‌కు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (14:54 IST)
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్ ఆహ్వనించారు. 

 
ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎంకి ఈఎన్‌సీ సీఐఎన్‌సీ వివరించారు. అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్‌ఆర్‌ అండ్‌ మిలన్‌ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

 
 సీఎం వైఎస్‌ జగన్‌ ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ను సన్మానించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు. ఈ సందర్భంగా సీఎంని కలిసిన నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ వికాస్‌ గుప్తా, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి, ఫ్లాగ్‌ లెఫ్టినెంట్‌ శివమ్‌ కందారి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments