Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ మీదుగా దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్?

Webdunia
శనివారం, 21 మే 2022 (11:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ మీదుగా దావోస్ చేరుకున్నారు. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 
 
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి శుక్రవారం ఉదయం తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి ప్రత్యేక లగ్జరీ విమానంలో బయలుదేరిన ఆయన ముందుగా లండన్‌కు వెళ్లి అక్కడ నంచి దావోస్‌కు చేరుకున్నట్టు సమాచారం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ప్రయాణించిన విమానం చేరుకుంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారు. 
 
ఈ సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారుల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. కాగా, శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎం దంపతులకు వీడ్కోలు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments