Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ మీదుగా దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్?

Webdunia
శనివారం, 21 మే 2022 (11:04 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ మీదుగా దావోస్ చేరుకున్నారు. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 
 
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి శుక్రవారం ఉదయం తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి ప్రత్యేక లగ్జరీ విమానంలో బయలుదేరిన ఆయన ముందుగా లండన్‌కు వెళ్లి అక్కడ నంచి దావోస్‌కు చేరుకున్నట్టు సమాచారం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన ప్రయాణించిన విమానం చేరుకుంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఆయన అక్కడే ఉంటారు. 
 
ఈ సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారుల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. కాగా, శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎం దంపతులకు వీడ్కోలు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments