Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన_800 మంది పోలీసులతో బందోబస్తు

Advertiesment
ys jagan
, మంగళవారం, 17 మే 2022 (11:06 IST)
ఏపీ సీఎం జగన్‌ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్‌ఐలను బందోబస్త్‌ విధులకు కేటాయించారు.
 
15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 5వేల 410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో స్థిరంగా బంగారం ధరలు