ఆయుర్వేద మందుపై అధ్యయనం : నెల్లూరుకు ఐసీఎంఆర్ వైద్య బృందం!

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (14:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొగిని ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఇచ్చే ఆయుర్వేద మందు కరోనాను పారదోలుతుందని ప్రజలు గట్టిగా నమ్మడమే కాదు, ఆ మందు కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా నిత్యం వేలమంది ఆనందయ్య కరోనా మందు కోసం బారులుతీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కృష్ణపట్నం వెళ్లే దారులన్నీ ప్రజలతో నిండిపోయికనిపిస్తున్నాయి. 
 
అంతేకాకుండా, ఈ మందు వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తన సమీక్ష సమావేశంలో చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. అయితే, ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. 
 
అందుకోసం నెల్లూరుకు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ఐసీఎంఆర్ బృందాన్ని పంపించాలని ఆదేశించారు. ఆయుర్వేద మందు గుణగణాలపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులకు నిర్దేశించారు. ఆ తర్వాతనే దానిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
 
అయితే, స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చొరవతో గత మూడు రోజులుగా నిలిచిపోయిన ఆయుర్వేదం మందు పంపిణీ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మందుకోసం ఇప్పటికే ఐదు వేల మందికిపైగా జనం అక్కడకు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments