Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రియురాలి పెళ్లి జరిగిపోతోంది.. లాక్డౌన్‌లో పెళ్ళిళ్లు వాయిదావేయండి.. సీఎంకు వినతి

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (14:39 IST)
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. తన ప్రియురాలి పెళ్లి జరిగిపోతోందని, ఈ లాక్డౌన్ కాలంలో పెళ్లిళ్లు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ ట్వీట్ చేశారు. ఇది వైరల్ కావడంతో నెటిజన్లు తనదైనశైలిలో స్పందిస్తున్నారు. 
 
ప్రస్తుతం బిహార్ రాష్ట్రంలో మే 25 వ‌ర‌కు లాక్డౌన్ విధించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే పెళ్లి ముహూర్తం పెట్టుకున్న వారు వివాహాన్ని త‌క్కువ మంది అతిథుల‌తో నిర్వహించాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, లాక్డౌన్‌లో త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ వివాహం మ‌రో అబ్బాయితో జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న ఓ యువ‌కుడు ఆమె పెళ్లిని ఆపేందుకు చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.
 
క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అన్ని వివాహ వేడుక‌ల‌ను వాయిదా వేయాల‌ని ఆదేశించాల‌ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ట్వీట్ ద్వారా ఆయ‌న‌ కోరాడు. వివాహాలపై నిషేధం విధిస్తే, త‌న‌ ప్రియురాలి వివాహం కూడా నిలిచిపోతుందని ఆయ‌న పేర్కొన్నాడు.
 
అలా చేస్తే సీఎంకు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పాడు. ప్రియురాలి వివాహం ఆపేందుకు మంచి ప్లాన్ వేశావంటూ అత‌డిపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. క‌రోనా వేళ విధించిన లాక్‌డౌన్ గ‌ర్ల్ ఫ్రెండ్లు వ‌దిలించుకున్న బాయ్ ఫ్రెండ్ల‌కు ఇలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని జోకులు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments