Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స ఈ ఆస్పత్రులు ఇవే...

ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స ఈ ఆస్పత్రులు ఇవే...
, గురువారం, 20 మే 2021 (20:04 IST)
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. ఏపీలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ వ్యాధి సోకిన వారికి ఉచితంగా చికిత్స అందించేందుకు వీలుగా బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆస్పత్రుల జాబితాను గురువారం విడుదల చేసింది. ఆ ఆస్పత్రుల వివవరాలను పరిశీలిస్తే... 
 
1. జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)
2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి
3. స్విమ్స్‌, తిరుపతి
4. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)
5. జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)
6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప
7. జీజీహెచ్‌, విజయవాడ
8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు
9.జీజీహెచ్‌, కర్నూలు
10. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు
11. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)
12. జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)
13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం
14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం
15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)
16. కేజీహెచ్‌, విశాఖపట్నం
17. విమ్స్‌, విశాఖపట్నం 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ సోకిన తల్లిదండ్రుల పిల్లలకు భరోసా... కృష్ణా జిల్లా కలెక్టర్