Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కార్యాలయ ఉద్యోగి పెళ్లికి వచ్చిన వైఎస్. జగన్ దంపతులు..

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (15:22 IST)
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న బి.రవిప్రసాద్ అనే ఉద్యోగి వివాహానికి సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణమంటపంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం దంపతుల రాకతో పెళ్లి మంటపంలో సందడి మరింత అధికమైంది.
 
నిజానికి ముఖ్యమంత్రి అంటే రోజుకుమ 24 గంటలు సరిపోని పదవి. రాష్ట్ర వ్యవ‌హారాల‌తోపాటు అధికారుల స‌మ‌న్వ‌యం.. ఇలా ప్ర‌తి నిముషం బిజీ, బిజీగా గడుపుతుంటారు. అయితే ఇంత‌టి బిజీ టైమ్‌లోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన చుట్టూ ఉన్నవాళ్ల మంచి, చెడులను తెలుసుకుంటూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.
 
దీనికి నిదర్శనమే గురువారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్‌ వివాహానికి సతీ సమేతంగా హాజరుకావడం. ఈ వివాహా వేడుకకి సీఎం దంపతులతో పాటు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమ వివాహానికి ముఖ్యమంత్రి హాజరు కావడంపట్ల రవి ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments