ఏపీ విద్యార్థులారా, ఇది మీ కోసమే.. పెరిగిన సెలవుల కారణంగా తరగతుల సమయాలు పెంపు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (20:28 IST)
ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా కళాశాలలకు సెలవులను పెంచిన సంగతి విదితమే. అయితే డిగ్రీ, పీజీ చదువుతున్న రెండవ మరియు మూడవ సంవత్సర విద్యార్థులకు ఆగస్ట్‌లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
 
కాగా మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం సెప్టెంబర్ నెలలో తరగతులను నిర్వహిస్తారు. కొవిడ్-19 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆలస్యం కారణంగా తరగతుల సమయాన్ని రోజుకు ఒక గంట నుంచి రెండు గంటల వరకు పెంచనున్నారు.
 
పండగలకు ఇచ్చే సెలవులకు సైతం కోత పెట్టనున్నారు. ప్రతి శనివారం కూడా సెలవులు లేకుండా తరగతులు నిర్వహించనున్నారు. ఆగస్ట్ నుండి మే వరకు అన్ని కళాశాలలు, యూనివర్సిటీలు పని చేసేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. రానున్న విద్యా సంవత్సరం, అనగా 2020-21 అకడమిక్ ఇయర్‌ను యథావిధిగా ఉండేలా ప్రణాళికలు రచించారు.
 
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మిగతా సంవత్సరాలలోని విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం అయ్యాక పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఆగస్ట్‌లో ఇంజనీరింగ్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. వీటిని పూర్తి చేసిన తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిర్వహిస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments