Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు

machilipatnam
Webdunia
శనివారం, 11 జూన్ 2022 (15:03 IST)
మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి అనుచరుల మధ్య శుక్రవారం తోపులాట జరిగింది. మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ బాలాశౌరిని పేర్ని నాని అనుచరులు అడుకుని "గోబ్యాక్‌ ఎంపీ" అంటూ నినాదాలు చేశారు. 
 
దీనిపై ఘాటుగానే స్పందించిన ఎంపీ "బందరు నీ అడ్డానా..!" అంటూ మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 
 
తమకు సంబంధించిన శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు ముస్లింలు ఎంపీ బాలాశౌరిని శుక్రవారం కోరారు. దీంతో ఆయన అక్కడకు వెళ్తుండగా.. పేర్ని నాని కీలక అనుచరుడు, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ అస్గర్‌అలీ తన వర్గీయులతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 
 
అయినా సరే ఎంపీ వెనక్కు తగ్గలేదు. ప్రజా సమస్యను పరిశీలించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నాని వర్గీయులను అక్కడ్నుంచి పంపేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments