Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (15:03 IST)
మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి అనుచరుల మధ్య శుక్రవారం తోపులాట జరిగింది. మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ బాలాశౌరిని పేర్ని నాని అనుచరులు అడుకుని "గోబ్యాక్‌ ఎంపీ" అంటూ నినాదాలు చేశారు. 
 
దీనిపై ఘాటుగానే స్పందించిన ఎంపీ "బందరు నీ అడ్డానా..!" అంటూ మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 
 
తమకు సంబంధించిన శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు ముస్లింలు ఎంపీ బాలాశౌరిని శుక్రవారం కోరారు. దీంతో ఆయన అక్కడకు వెళ్తుండగా.. పేర్ని నాని కీలక అనుచరుడు, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ అస్గర్‌అలీ తన వర్గీయులతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 
 
అయినా సరే ఎంపీ వెనక్కు తగ్గలేదు. ప్రజా సమస్యను పరిశీలించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నాని వర్గీయులను అక్కడ్నుంచి పంపేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments