Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానుల అంశంపై త్వరలో క్లారిటీ

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (14:39 IST)
ఏపీ సర్కారు మూడు రాజధానుల అంశంపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం వున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా బిల్లు తయారీపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం సీఆర్డీఏ అమలులో ఉన్నందున అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు మూడు రాజధానుల బిల్లు వ్యవహారం పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తాజాగా తాము తీసుకొచ్చిన మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉప సంహరించుకుంటూ బిల్లు ఆమోదించింది. శాసనసభ, మండలిలో ఈ ఉపసంహరణ బిల్లుకు ఆమోదం లభించింది. 
 
దీనికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ మండలి ఛైర్మన్ ఆ ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఇచ్చిన లేఖలతో సహా ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఏపీ రాజధాని బిల్లల ఉపసంహరణ కేసు విచారణ జరిగింది.
 
అయితే గవర్నర్ ఆమోదంతో వచ్చిన తరువాత ఆ బిల్లులను పరిశీలించి పిటీషనర్ల వాదన పైన ధర్మాసనం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో..మూడు రాజధానుల విషయంలో అటు ప్రభుత్వం వేసే అడుగులు..ఇటు న్యాయపరంగా చోటు చేసుకొనే పరిణామాలపైన ఆసక్తి నెలకొని ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments