Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు రాజధానులు క్రమంగా మూడు రాష్ట్రాలకు దారితీయొచ్చు!

Advertiesment
Andhra Pradesh
, సోమవారం, 29 నవంబరు 2021 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు భవిష్యత్తులో క్రమంగా మూడు రాష్ట్రాలకు దారతీయొచ్చునని భువనేశ్వర పీఠాధిపతి (గన్నవరం) కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. అందువల్ల మూడు రాజధానుల అంశాన్ని మొగ్గలోనే తుంచేయాలని ఆయన అన్నారు.
 
కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పైగా, త్వరలోనే మూడు రాజధానుల కోసం సమగ్రమైన మెరుగైన బిల్లును ప్రవేశపెడతామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 
 
దీనిపై గుంటూరులోని తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలానంద భారతి మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడుతామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇది కాలక్రమంలో మూడు రాష్ట్రాలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉన్నపుడు మూడు ప్రాంతాలను మూడు ముక్కలు చేయాలన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. 
 
ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే ప్రాథమిక సూత్రం మేరకు ఒకే ప్రాంతంలోనే రాజధానివుంచి.. అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించాలని కోరారు. పైగా, ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేసి, రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించారని ఆయన గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌతాఫ్రికా నుంచి థానేకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్