Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరసత్వ చట్టం అవసరం లేదు : షేక్ హసీనా

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (05:20 IST)
భారత దేశం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కావడం లేదని, దాని అవసరం ఏమీ లేదని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అన్నారు. అయినప్పటికీ, ఇది భారత దేశ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించారు. గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
 
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ) అనేవి భారత దేశ అంతర్గత వ్యవహారాలని బంగ్లాదేశ్ ఎప్పుడూ చెప్తోందన్నారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్ఆర్‌సీ కేవలం భారత దేశ అంతర్గత వ్యవహారమని తనకు చెప్పారన్నారు. 2019 అక్టోబరులో తాను న్యూఢిల్లీ వెళ్లినపుడు తనకు మోదీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారన్నారు.
 
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలో మతపరమైన హింస, వేధింపులకు తట్టుకోలేక భారత దేశానికి 2014 డిసెంబరు 31నాటికి వచ్చినవారికి పౌరసత్వం ఇచ్చేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించారు. ఈ మూడు దేశాల్లో ముస్లింలు మెజారిటీ కాబట్టి, అక్కడి మైనారిటీలు భారత దేశానికి వస్తే, పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments