Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల వేధింపులు.. రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య అంటూ సెల్ఫీ వీడియో

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (16:32 IST)
Man
పోలీసులు వేధిస్తున్నారని.. ఓ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. మస్తాన్ బాయ్ అనే వ్యక్తి 12 వాహనాల తాకట్టులో పోలీసులకు చిక్కాడు. వాటిలో దొంగతనం చేసిన వాహనాలు ఉండడంతో మస్తాన్ కొట్టించి తన పేరు చెప్పించాలని పోలీసులు చూస్తున్నారని యువకుడు ఆరోపణలు చేశాడు. 
 
తనకు కానిస్టేబుల్ ఫోన్ చేసి తనపై కేసులు పెడుతామని బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని కానిస్టేబుల్ బాబు బెదిరించాడని ఆరోపణలు చేశాడు. 
 
సిఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడు మదార్ వలి వాపోయాడు. డబ్బు కోసం వేధిస్తున్నందున.. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మదార్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. 
 
ఈ వీడియోను పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్‌పి, సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ చేరాలని విజ్ఞప్తి చేశాడు. తన చావుకు సిఐ పసుపులేటి రామకృష్ణ, కానిస్టేబుల్ కారణమని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments