చిత్తూరు జిల్లాలో దారుణ హత్య.. కుమార్తెతో ప్రియుడు.. ముక్కలు ముక్కలుగా నరికి?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (17:09 IST)
చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. పలమనేరులో ఐదు రోజు క్రితం అదృశ్యమైన ధనశేఖర్ అనే 23 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్ రెండేళ్ల పాటు ప్రేమిస్తున్నాడు. అయితే బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. 
 
పోలీసులు ధనశేఖర్ కాల్ డేటా ఆధారంగా బాలిక తండ్రి బాబును అరెస్ట్ చేశారు. విచారణలో శనివారం రాత్రి కుమార్తెతో ధనశేఖర్ వుండటాన్ని చూశానని.. అతడిని కత్తితో నరికి హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఆపై మృతదేహాన్ని బావిలో పడేశాడని.. మృతదేహం బావిలో తేలిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టినట్లు అంగీకరించాడు. నేరం అంగీకరించడంతో బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments