Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుంది : ఎంపీ శివప్రసాద్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహ

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:09 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు రెచ్చిపోతున్నారు. 
 
ఈ సందర్భంగా శివప్రసాద్ స్పందిస్తూ, సీఎం చంద్రబాబు సహనానికీ ఓ హద్దు ఉంటుందని, ఆయన అలిగితే పరిస్థితులు విషమిస్తాయన్నారు. "అంత దూరం తీసుకురావద్దు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు" అని వ్యాఖ్యానించారు. హామీలు అమలు చేస్తామంటూనే కాలయాపన చేస్తున్నారని, అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే తాము నిరసనలకు దిగినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments