Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మెత్తకాయల ద్రావణం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (19:50 IST)
నాటు సారా తాగినా, ఉమ్మెత్తకాయల ద్రావణం తాగినా కరోనా వైరస్ రాదంటూ చిత్తూరు జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. దీన్ని నమ్మి ఉమ్మెత్తకాయల ద్రావణం తాగిన ఏడుగురు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలం, ఏ.కొత్తూరు గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబంలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
కరోనా వైరస్ నివారణ కోసం ఉమ్మెత్తకాయల ద్రావణం తాగడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ నివారణ కోసం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. సారా తాగినా కరోనా నివారించవచ్చునని మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి వాటిని నమ్మకూడదని అధికారులు సూచిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఏపీలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకూ... కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు గుంటూరులో నమోదైంది. ఫలితంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరింది.

సంబంధిత వార్తలు

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

ఫుష్ప ఫుష్ప.. సాంగ్ పై సింగర్ దీపక్ బ్లూ సెస్సేషనల్ కామెంట్

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments