Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (13:03 IST)
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వర రావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనలో టీసీ సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌, విజయన్‌‌లుగా పోలీసులు గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
కాగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, రాజమండ్రి, కర్నూలు వంటి పలు ప్రాంతాలలో బ్లేడ్ చేసిన ఆగడాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా ఒంటరిగా రాత్రి సమయంలో ప్రయాణించేవారిపై దాడులకు పాల్పడి దోచుకునేవారు. ఈ క్రమంలో కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments