మెగాస్టార్ చిరంజీవి- జగన్ భేటీ వాయిదా

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (04:59 IST)
టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన భేటీ వాయిదా పడింది.

నిజానికి వీరిద్దరి మధ్య భేటీని ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. చిరంజీవితోపాటు ఆయన తనయుడు రాంచరణ్ కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉంది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను వీక్షించాల్సిందిగా కోరేందుకే చిరంజీవి భేటీ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి ఆయనను తొలిసారి కలవనుండడంతో సర్వత్ర చర్చ మొదలైంది.
 
అనుకున్న ప్రకారం శుక్రవారం ఉదయం జగన్‌తో చిరంజీవి భేటీ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఈ భేటీ 14వ తేదీకి వాయిదా పడింది. ‘సైరా’ సినిమాను వీక్షించమని కోరేందుకే జగన్‌తో చిరు భేటీ అవుతున్నారంటూ అనధికారిక వర్గాలు చెబుతున్నా.. వీరి లంచ్ భేటీ వార్తలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు తెరతీశాయి.

కాగా, ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన చిరంజీవి.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను చూడాల్సిందిగా కోరారు. దీంతో ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments