Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మున్సిపల్ కమిషనర్‌గా సీఎం జగన్?

Advertiesment
Jagan
, బుధవారం, 2 అక్టోబరు 2019 (16:08 IST)
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు. పార్వతీపురం పురపాలక శాఖ తప్పిదం జనాలకు నవ్వులాటగా మారింది.

వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టారు. అంతే కాకుండా ప్రత్యేక అధికారిగా ఎమ్మెల్యే జోగారావు ఫోటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీని వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేశారు.

దీంతో ఫ్లెక్సీని చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. అనంతరం తప్పిదం తెలసుకున్న మున్సిపల్ అధికారులు.. వెంటనే ఫ్లెక్సీని తొలగించారు.

ఇదిలా వుండగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెద రాయవరం గ్రామ సచివాలయంపై ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి బొమ్మపై రంగుపూసిన పెదరాయవరం గ్రామానికి చెందిన కొట్టు సూరిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని స్టేషన్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంటులో అల్లూరి విగ్రహం