Webdunia - Bharat's app for daily news and videos

Install App

భన్వర్ లాల్‌కు వైకాపా మహిళతో అక్రమ సంబంధం? ఆమంచి కృష్ణమోహన్ ఏమంటున్నారు?

Webdunia
ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (14:41 IST)
గుంటూరు జిల్లా చీరాల అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేస్తున్న నేత ఆమంచి కృష్ణమోహన్. ఈయన ఆదివారం చీరాలలో విలేకరులతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తుకు తెచ్చారు. 
 
"నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అప్పటి ఎన్నికల అధికారి భన్వర్ లాల్ టీడీపీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయించి.. ప్రచారానికి వచ్చిన వైసీపీ మహిళల్లో ఒకరితో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టాలని టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు చెప్పారని ఆమంచి ఆరోపించారు. ఈ ఇలా తాను వ్యాఖ్యానించలేదని చంద్రబాబు నార్కో అనాలసిస్‌కు సిద్ధమా? నీ మనవడు దేవాన్ష్ పై ప్రమాణం చేసి చెబుతావా" అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 
 
అంతేకాకుండా, తెలంగాణ సీఎం కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయనీ, ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయన్నారు. తాను ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారని స్పష్టంచేశారు. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తానని చంద్రబాబు జోక్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏం అవసరమో బాబుకు అస్సలు అవగాహన లేదని ఆమంచి కృష్ణమోహన్ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments