Webdunia - Bharat's app for daily news and videos

Install App

భన్వర్ లాల్‌కు వైకాపా మహిళతో అక్రమ సంబంధం? ఆమంచి కృష్ణమోహన్ ఏమంటున్నారు?

Webdunia
ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (14:41 IST)
గుంటూరు జిల్లా చీరాల అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేస్తున్న నేత ఆమంచి కృష్ణమోహన్. ఈయన ఆదివారం చీరాలలో విలేకరులతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తుకు తెచ్చారు. 
 
"నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అప్పటి ఎన్నికల అధికారి భన్వర్ లాల్ టీడీపీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయించి.. ప్రచారానికి వచ్చిన వైసీపీ మహిళల్లో ఒకరితో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టాలని టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు చెప్పారని ఆమంచి ఆరోపించారు. ఈ ఇలా తాను వ్యాఖ్యానించలేదని చంద్రబాబు నార్కో అనాలసిస్‌కు సిద్ధమా? నీ మనవడు దేవాన్ష్ పై ప్రమాణం చేసి చెబుతావా" అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 
 
అంతేకాకుండా, తెలంగాణ సీఎం కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయనీ, ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయన్నారు. తాను ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారని స్పష్టంచేశారు. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తానని చంద్రబాబు జోక్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏం అవసరమో బాబుకు అస్సలు అవగాహన లేదని ఆమంచి కృష్ణమోహన్ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments