నా పేరు ఎందుకు ఉపయోగించారు?: చింతమనేని ప్రభాకర్‌

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (20:15 IST)
'రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎంతోమంది ఉండగా, కేసుల వివరాలు చెప్పడానికి నా పేరు ఎందుకు ఉపయోగించారు?' అంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ ను టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ నిలదీశారు.

అసెంబ్లీలో సిఎం జగన్‌ చెప్పే కట్టుకథలను డిజిపి బాగా వంటబట్టించుకున్నారని, అక్రమ కేసుల సినిమాలు చూపించడంలో డిజిపి దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిజిపికి వైసిపి అంటే అంత వ్యామోహం ఉంటే.. ఆ రుణం మరో రూపంలో తీర్చుకోవాలే తప్ప, తన వంటి వారితో చెలగాటాలు వద్దని,  డిజిపి పదవిని కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని  హితువు పలికారు.

మంగళగిరిలోని ఎపి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ మీడియా సమావేశం నిర్వహించి, ఎవరిదైనా నేర చరిత్ర తెలుసుకోవడం ఎలాగో యాప్‌ ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎంటర్‌ ప్రైజెస్‌ సెర్చ్‌లో టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ పేరు టైప్‌ చేసి ఆయనపై ఉన్న కేసుల వివరాలను మీడియా ప్రతినిధులకు డెమో ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments