Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైశ్యుల పట్ల ముఖ్యమంత్రి నిర్ణయం సాహసోపేతమైనది: మంత్రి పేర్ని నాని

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (22:29 IST)
దేవుడి ఆస్తులు కైంకర్యంకు గురి కాకుండా మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తే  ఆయన తనయుడిగా ముఖ్యమంత్రి  జగన్‌ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను క్రయ విక్రయాలు జరపడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించిన నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు.     
 
సోమవారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో మచిలీపట్నం ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మంత్రి పేర్ని నానిను ,ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్  వి.సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్‌లో ఇటీవల తీర్మానం చేసినందుకు వారు కృతజ్ఞతలు మంత్రికి మచిలీపట్నంకు చెందినపలువురు ఆర్య వైశ్య ప్రముఖులు తెలిపారు. 

మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి వెనుక ఉన్న పల్లపోతు సుబ్బారావు ధర్మ సత్రం, చిట్టూరి వీరయ్య ధర్మ సత్రం, తాడేపల్లి వారి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని  పాలనాపరమైన అంశాల్లో అవకతవకలు ఉన్నట్టుగా వెల్లడైతే తక్షణం ప్రభుత్వం ఈ మినహాయింపును రద్దు చేస్తుందని షరతు విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments