Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. 121 చోట్ల వైసీపీ.. నగరిలో రోజా లీడ్

Webdunia
గురువారం, 23 మే 2019 (11:06 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 145కుపైగా నియోజకవర్గాల్లో సత్తా చాటుతోంది. తాజాగా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా 4,200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇక విజయనగరంలోని కురుపాంలోని పాముల పుష్పవాణి లీడ్‌లో ఉన్నారు. 
 
అలాగే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెలువడగా.. 121 చోట్ల వైసీపీ, 25 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటివరకూ కౌంట్ చేసిన ఓట్లలో వైసీపీకి 50.9 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 38.2 శాతం ఓట్లు, జనసేనకు 6.8 శాతం ఓట్లు వచ్చాయని ఈసీ అధికారికంగా ప్రకటించింది. 
 
మరోవైపు లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే, 532 నియోజకవర్గాల ట్రెండ్స్ వెలువడగా, బీజేపీ 285 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 49 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైకాపా 24 స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 
 
మిగతా పార్టీల విషయానికి వస్తే, తృణమూల్ కాంగ్రెస్ 24, బీఎస్పీ 12, బిజూ జనతాదళ్ 12, డీఎంకే 22, ఏఐఏడీఎంకే 2, జనతాదళ్ (యు) 16, ఎల్జేపీ 6, ఎన్సీపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ 8 స్థానాల్లో, టీఆర్ఎస్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయని ఈసీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments