పార్టీని లేకుండా చేయాలనే దాడులు... చంద్రబాబు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (16:20 IST)
రాష్ట్రంలో తమ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే పథకం ప్రకారం దాడులు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​పై దాడిచేసిన వారిని పోలీసులు దగ్గర ఉండి సాగనంపటం సిగ్గుచేటని మండిపడ్డారు. 
 
మంగళవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నిరసన చేపట్టారు. ఈ దీక్ష గురువారం నుంచి శుక్రవారం వరకు 36 గంటల పాటు దీక్షను చేపట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదని.. కానీ ఇవాళ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామన్నారు. 
 
వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకోలేకపోతే పోలీస్‌ వ్యవస్థను మూసేయాలని డీజీపీకి హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానన్నారు. 
 
ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింభమని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
తమ పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమన్న బాబు.. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments