Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు కంగారు పుట్టింది... నారా లోకేష్(Video)

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (20:25 IST)
2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుగారు విజయం సాధించినప్పుడు తనకు కంగారు పుట్టిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎందుకంటే ఆనాడు విభజన కారణంగా లోటు బడ్జెట్టుతో వున్న ఏపీని అభివృద్ధి బాటలో నడిపించడం సాధ్యమా అని డౌటు పడ్డామనీ, కానీ ఆ తర్వాత ఆ అనుమానాలు పటాపంచాలయ్యాయన్నారు. 
 
ఇల్లు లేని ప్రతి వ్యక్తి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్. శనివారం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం, రేణిగుంట విమనాశ్రయం సమీపంలో ఉన్న వికృతమాల గ్రామం వద్ద రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ, గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూ. 100 కోట్లతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో  నిర్మించిన 1800 జి ప్లస్ త్రి గృహాలు, వికృతమాల ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కాలనీలను ప్రారంభోత్సవం చేశారు.
 
పేదవాడికి సొంతింటి కలను సాకారం చేశామని, 2022 నాటికి రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు మంత్రి లోకేష్. మోడీ ఎపికి తీరని అన్యాయం చేశారని, ఆయన పని పడతామని, ఎపిలో పర్యటించే అర్హత మోడీకి లేదన్నారు లోకేష్. ఎపికి రావాల్సిన నిధులు ఇవ్వడంలో కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ఇంకా ఆయన మాటలను ఈ వీడియోలో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments