Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపి డిజిపికి చంద్రబాబు లేఖ, ఎందుకు రాశారంటే..?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:27 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు డిజిపికి లేఖ రాశారు. టిడిపి కార్యకర్తలు, నాయకులపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతుంటే కార్యకర్తలు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.
 
చిత్తూరుజిల్లా చంద్రగిరికి చెందిన రాకేష్ చౌదరి అనే టిడిపి కార్యకర్తపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. వైసిపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ 2007 సంవత్సరంలో జరిగిన స్థల వివాదాన్ని చూపించి అందులో ముద్దాయిగా ఇరికించి అరెస్టు చేశారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
 
వెంటనే రాకేష్ చౌదరిని విడుదల చేయాలని.. అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డిజిపితో పాటు ఆ లేఖను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డికి అటాచ్ చేశారు చంద్రబాబు. డిజిపి స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments