ఎపి డిజిపికి చంద్రబాబు లేఖ, ఎందుకు రాశారంటే..?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:27 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు డిజిపికి లేఖ రాశారు. టిడిపి కార్యకర్తలు, నాయకులపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతుంటే కార్యకర్తలు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.
 
చిత్తూరుజిల్లా చంద్రగిరికి చెందిన రాకేష్ చౌదరి అనే టిడిపి కార్యకర్తపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. వైసిపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ 2007 సంవత్సరంలో జరిగిన స్థల వివాదాన్ని చూపించి అందులో ముద్దాయిగా ఇరికించి అరెస్టు చేశారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
 
వెంటనే రాకేష్ చౌదరిని విడుదల చేయాలని.. అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డిజిపితో పాటు ఆ లేఖను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డికి అటాచ్ చేశారు చంద్రబాబు. డిజిపి స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments