Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఇలానే ఉంటాయి.. చంద్రబాబు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (12:14 IST)
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఓ మంచి ఉదాహరణ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 
 
జాకీ బ్రాండ్ దుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ఏపీని వదిలివేసి తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఏపీలో పరిశ్రమను నెలకొల్పే ఆలోచనను విరమించుకుంది. పైగా, ఈ కంపెనీకి గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది. అదేసమయంలో తెలంగాణాలో రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
ఈ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడంపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. 
 
రాయలసీమలో తాను తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులు తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా లేక కాసులకు కక్కుర్తిపడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా, నేతలను మేపలేక జాకీ పరార్ అంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని కూడా ఆయన ట్యాగ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments