Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఇలానే ఉంటాయి.. చంద్రబాబు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (12:14 IST)
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఓ మంచి ఉదాహరణ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 
 
జాకీ బ్రాండ్ దుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ఏపీని వదిలివేసి తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఏపీలో పరిశ్రమను నెలకొల్పే ఆలోచనను విరమించుకుంది. పైగా, ఈ కంపెనీకి గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది. అదేసమయంలో తెలంగాణాలో రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
ఈ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడంపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. 
 
రాయలసీమలో తాను తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులు తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా లేక కాసులకు కక్కుర్తిపడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా, నేతలను మేపలేక జాకీ పరార్ అంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని కూడా ఆయన ట్యాగ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments