నేనలా చేయడం వల్లనే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్... వైసీపి వాళ్లకు అర్థం కాదిది: బాబు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (20:32 IST)
అమరావతి రాజధాని అంశంపై వైసీపి నాయకులు చేస్తున్న భిన్న ప్రకటనలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు.
 
''సమాజం కోసం చేసిన కృషి ఎప్పుడూ ఫలిస్తుంది. అందుకు ఆనాడు హైదరాబాద్‌లో చేసిన అభివృద్దే నిదర్శనం. పుల్లెల గోపీచంద్‌కు అప్పట్లో గచ్చిబౌలిలో 5 ఎకరాలు ఆకాడమీ కోసం ఇచ్చాం. ఇప్పుడు అక్కడ క్రీడా మాణిక్యాలు తయారవుతున్నాయి. పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ అయి తెలుగువారికి గర్వకారణంగా నిలిచింది.
 
తెలుగు ప్రజలకు ఒక శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రూపొందించాం. వైసీపీ వాళ్ళకు ఇవన్నీ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదు. చెబితే వినేంత విజ్ఞతా లేదు. ఒక్క అవకాశం అంటూ వచ్చి అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేసారు.
 
కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన తెతెదేపా కార్యకర్తలు, నాయకులతో ఈ రోజు సమావేశమయ్యాను. తెలంగాణలో నాయకులు వెళ్ళినా కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదు. వారి నుంచే మళ్ళీ నాయకులను తయారుచేసి తెలంగాణాలో తెదేపా పుంజుకునేలా చేస్తా. ఏపీ, తెలంగాణలో తెదేపా శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరం'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments