Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

Webdunia
గురువారం, 12 మే 2022 (16:14 IST)
కుప్పంలో మూడు రోజుల పాటు టీడీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీ ఈ పర్యటన ప్రారంభమైంది. 13, 14 తేదీల్లోనూ చంద్రబాబు పర్యటిస్తారు.

శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు. గురువారం కుప్పంలో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి జరిగే పట్టాలమ్మ జాతరలో పాల్గొన్నారు. 
 
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దులో ఉన్న పట్టాలమ్మ తల్లి జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరలా పట్టాలమ్మ జాతరలా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
 
అలాగే ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు కుప్పంలో పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. అధినేత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments