Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్విచక్రవాహనం నుంచి కిందపడిన మహిళలు ... కాన్వాయ్ ఆపి చికిత్స చేయించిన చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు చికిత్స చేయించారు. ద్విచక్రవాహనంపై వెళుతూ జారి కిందపడిపోయిన ఇద్దరు మహిళలను గుర్తించిన ఆయన.. ఆయన తన కాన్వాయ్‌ను ఆపి వారికి చికిత్స చేయించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ సీతానగరంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. అయితే, మహిళలు కిందపడిపోయిన విషయాన్ని గుర్తించిన చంద్రబాబు తన కాన్వాయ్‌ను ఆపించారు. కారు దిగి గాపడిన ఇద్దరు మహిళల వద్దకు వచ్చారు. 
 
తన కాన్వాయ్‌లోని వైద్యుడితో వారికి చికిత్స చేయించారు. బాధిత మహిళలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఇంటివద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. అలాగే, తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో బాధితుల బంధువులకు ఫోన్ చేయించారు. బాధితులను వాహనలో పంపించి, ఆయన అక్కడ నుంచి పార్టీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments