Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్విచక్రవాహనం నుంచి కిందపడిన మహిళలు ... కాన్వాయ్ ఆపి చికిత్స చేయించిన చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు చికిత్స చేయించారు. ద్విచక్రవాహనంపై వెళుతూ జారి కిందపడిపోయిన ఇద్దరు మహిళలను గుర్తించిన ఆయన.. ఆయన తన కాన్వాయ్‌ను ఆపి వారికి చికిత్స చేయించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ సీతానగరంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. అయితే, మహిళలు కిందపడిపోయిన విషయాన్ని గుర్తించిన చంద్రబాబు తన కాన్వాయ్‌ను ఆపించారు. కారు దిగి గాపడిన ఇద్దరు మహిళల వద్దకు వచ్చారు. 
 
తన కాన్వాయ్‌లోని వైద్యుడితో వారికి చికిత్స చేయించారు. బాధిత మహిళలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఇంటివద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. అలాగే, తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో బాధితుల బంధువులకు ఫోన్ చేయించారు. బాధితులను వాహనలో పంపించి, ఆయన అక్కడ నుంచి పార్టీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments