Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్విచక్రవాహనం నుంచి కిందపడిన మహిళలు ... కాన్వాయ్ ఆపి చికిత్స చేయించిన చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు చికిత్స చేయించారు. ద్విచక్రవాహనంపై వెళుతూ జారి కిందపడిపోయిన ఇద్దరు మహిళలను గుర్తించిన ఆయన.. ఆయన తన కాన్వాయ్‌ను ఆపి వారికి చికిత్స చేయించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ సీతానగరంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. అయితే, మహిళలు కిందపడిపోయిన విషయాన్ని గుర్తించిన చంద్రబాబు తన కాన్వాయ్‌ను ఆపించారు. కారు దిగి గాపడిన ఇద్దరు మహిళల వద్దకు వచ్చారు. 
 
తన కాన్వాయ్‌లోని వైద్యుడితో వారికి చికిత్స చేయించారు. బాధిత మహిళలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఇంటివద్ద దించి, వారికి కావాల్సిన మందులను ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. అలాగే, తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో బాధితుల బంధువులకు ఫోన్ చేయించారు. బాధితులను వాహనలో పంపించి, ఆయన అక్కడ నుంచి పార్టీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments