Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:03 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటి సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో ఈ నెల 6వ తేదీన ఆయన హస్తినకు వెళ్లనున్నారు. 
 
ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటరులో జరిగే ఈ సమావేశంలో 75 యేళ్ళ స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికోసం నిర్వహిచే సన్నాహక సమావేశంలో చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. 
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీల మధ్య స్నేహం చెడింది. దీంతో చంద్రబాబుకు, నరేంద్ర మోడీకి మధ్య గత మూడేళ్లుగా మాటలు లేవు. ఈ క్రమంలో తన సారథ్యంలో జరిగే ఈ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments