Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:03 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటి సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో ఈ నెల 6వ తేదీన ఆయన హస్తినకు వెళ్లనున్నారు. 
 
ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటరులో జరిగే ఈ సమావేశంలో 75 యేళ్ళ స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికోసం నిర్వహిచే సన్నాహక సమావేశంలో చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. 
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీల మధ్య స్నేహం చెడింది. దీంతో చంద్రబాబుకు, నరేంద్ర మోడీకి మధ్య గత మూడేళ్లుగా మాటలు లేవు. ఈ క్రమంలో తన సారథ్యంలో జరిగే ఈ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments