Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:03 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటి సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆయనకు పిలుపు వచ్చింది. దీంతో ఈ నెల 6వ తేదీన ఆయన హస్తినకు వెళ్లనున్నారు. 
 
ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటరులో జరిగే ఈ సమావేశంలో 75 యేళ్ళ స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికోసం నిర్వహిచే సన్నాహక సమావేశంలో చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. 
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీల మధ్య స్నేహం చెడింది. దీంతో చంద్రబాబుకు, నరేంద్ర మోడీకి మధ్య గత మూడేళ్లుగా మాటలు లేవు. ఈ క్రమంలో తన సారథ్యంలో జరిగే ఈ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments