Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం!!

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:43 IST)
కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తను చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్ శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మిస్తామని మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. 
 
టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని... 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 
 
ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అమెరికాకు చెందిన 'వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్' సంస్థతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. పలు అధ్యయనాల తర్వాత కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు చెప్పింది.
 
కాగా, గతంలో కూడా ఇక్కడ అణు విద్యుత్ కర్మాగారం నిర్మించేందుకు ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇపుడు ఇదే ప్రాంతంలో ప్రధాని మోడీ సర్కారు ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments