Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టండి : ఉపరాష్ట్రపతి

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (22:39 IST)
తిరుపతి విమానాశ్రయంలో 177 కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్ట్ విస్తరణ - బలోపేతం పనులను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యంలో కావాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలంటే సంస్కరణలు అవసరమన్నారు. ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిష్కరించబోతోందన్నారు. 
 
తిరుపతి అభివృద్థి వేగంగా జరుగుతుండడం సంతోషంగా ఉందని, తిరుపతి విమానాశ్రయంలో రన్ వే పనులు త్వరగా పనులు పూర్తయి అంతర్జాతీయ రాకపోకలు సాగాలని ఆకాంక్షించారు. స్వచ్ఛభారత్ కు ప్రజలు సహకరించాలని కోరారు. తిరుపతిలో రైల్వేస్టేషన్ లో ఆధునిక వసతులను రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తానని చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్థి చెందిన ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతని, అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ విమాన రాకపోకలు సాగనున్నాయని చెప్పారు. పెరుగుతున్న ప్రయాణీకుల దృష్ట్యా తిరుపతి విమానాశ్రయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments