Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత చెప్పిన ఆ 15 మంది అనుమానితులు ఎవరు?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:49 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసును టేకప్ చేసిన సీబీఐ... దర్యాప్తును శరవేగంగా సాగిస్తోంది. ఇందులోభాగంగా, అనేకమందిని విచారిస్తోంది. తాజాగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత వద్ద మూడు గంటల పాటు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె అనుమానం ఉన్న 15 మంది పేర్లను సీబీఐ అధికారులకు చెప్పింది. వారి పేర్లను సీబీఐ అధికారులు నమోదు చేసుకున్నారు. అలాగే, ఆమె సమర్పించిన ఆధారాలు, డాక్యుమెంట్లను కూడా ఆమె తీసుకున్నారు. 
 
కాగా, తన హత్య కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు సంస్థపై తనకు నమ్మకం లేదని, సీబీఐ చేత కేసును విచారించాలంటూ హైకోర్టును సునీత ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో, పిటిషన్‌లో ఆమె పేర్కొన్న వివరాలను సీబీఐ అధికారులు తెలుసుకున్నారు. తనకు అనుమానం ఉన్న 15 మంది వ్యక్తుల పేర్లను కూడా తెలిపారు. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన పులివెందుల సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు రెండో రోజు విచారించారు. సోమవారం కూడా ఆయనను నాలుగు గంటల సేపు విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో శంకరయ్య సీఐగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments