Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (19:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన కోర్టును కోరిన విషయం తెల్సిందే. 
 
విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కొన్ని రోజుల క్రితమే ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తన బెయిల్ నిబంధనలు సడలించాలంటూ కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. కానీ కోర్టు మాత్రం ఇరు వర్గాల వాదనలు ఆలకించి సానుకూలంగా స్పందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments