Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని నోటి దూల.. రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (18:34 IST)
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జనసేనాని పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై జనసేన కార్యకర్తలు రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పోసానీపై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా పోసానికి రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
గత 2022లో కూడా పవన్‌పై పోసాని చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన పార్టీ రాజమహేంద్రవరం నేత యందం ఇందిరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇకపోతే.. ఏలూరు వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. దీంతో పోసాని పవన్ కు కౌంటర్ ఇస్తూ... వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదంటూ చెప్పుకొచ్చారు. వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధపడరా అంటూ ప్రశ్నించారు. 
 
భీమవరంలో పవన్ కల్యాణ్ ఓటమికి టీడీపీనే కారణమని పోసాని ఆరోపించారు. పవన్ చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారని పోసాని విమర్శలు చేశారు. 
 
కాపు ఓట్ల కోసం అత్తా కోడలు పవన్‌తో డ్రామా ఆడుతున్నారన్నారు. అత్త కోడలు ఇద్దరు కలిసి పవన్ ను ఐస్ చేశారని భువనేశ్వరి, బ్రాహ్మణిని ఉద్దేశించి మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments