Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Advertiesment
chandrababu
, మంగళవారం, 3 అక్టోబరు 2023 (09:12 IST)
గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసును కొట్టి వేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేట్టనుంది. సర్వోన్నత న్యాయస్థానంలోని ఆరో నంబరు కోర్టులో ఐటం నంబర్ 63గా ఈ కేసు లిస్ట్ చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.272కోట్ల అవినీతి జరిగిందంటూ వైకాపా ప్రభుత్వం కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసి  రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా బంధించింది. అయితే, తనపై అక్రమంగా కేసు పెట్టారనీ, దీన్ని కొట్టి వేయాలంటూ కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అలాగే, క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టే సమయంలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ ఏపీ సీఐడీ పోలీసులు కేవియట్ రిట్‌ను దాఖలు చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళసూత్రాన్ని మింగేసి గేదె... ఆ తర్వాత ఏం జరిగిందంటే...