Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు

Webdunia
గురువారం, 7 మే 2020 (17:35 IST)
వైజాగ్ నగరంలో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదైంది. వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి లీకైన విషవాయువు తీవ్ర ప్రభావం చూపింది.

ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీకేజీకి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైందని వెల్లడించారు.

ప్రస్తుతం గ్యాస్ లీకేజీ నిలిచిపోయిందని, ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీటిని పిచికారి చేసి వాతావరణంలో విషవాయువు ప్రభావాన్ని నియంత్రించినట్టు మంత్రి వివరించారు.

పరిశ్రమల శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషవాయు ప్రభావం ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి ఒకటిన్న కిలోమీటరు పరిధిలో అధికంగా ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

తర్వాతి కథనం
Show comments