Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిశుద్ధ్య కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలి: సిఐటియు

Webdunia
గురువారం, 7 మే 2020 (17:31 IST)
రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు  ఎం రవి ఎం భాగ్య రాజులు  డిమాండ్ చేశారు.
 
 రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 8,600 రూపాయలు జీతం ఇస్తూ వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న ఎస్ కే వలీ ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ నాలుగు నెలల నుండి వారికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.
 
జీతాలు లేకుండా లాక్ డౌన్ సమయంలో కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు  నాలుగు నెలల నుండి జీతాలు లేక అప్పు ఇచ్చే వాళ్ళు లేక కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు.
 
మరో ప్రక్క పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండా వారితో పనులు చేయించడం ఏమిటని పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు అంటే అంత అలుసా ఈ పాలకులకు అని ప్రశ్నించారు.
 
 నాలుగు నెలల నుండి  జీతాలు రాక అడిగి అడిగి విసిగివేసారిన పారిశుద్ధ్య కార్మికులు గురువారం నాడు రాజధాని గ్రామాలలో విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారని దీనికి సి ఆర్ డి ఎ  ఎస్.కె ఏజెన్సీ ఏ బాధ్యత వహించాలని అన్నారు.
 
తక్షణం పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు రక్షణ పరికరాలు ఇవ్వాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. నవులూరు లో జీతాలు ఇవ్వాలని కోరుతూ సమ్మెకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు కార్మికులకు మద్దతు తెలుపుతున్న సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు రవి, టిడిపి నాయకులు మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
 
రాజధాని గ్రామమైన ఎర్రబాలెం లో పెండింగ్ ఉన్న నాలుగు నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments