Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృదయ సంబంధ వ్యాధులు కిడ్నీ వ్యాధులు కూడా ముస్లింలలోనే ఉన్నాయా?: అసదుద్దీన్

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (11:23 IST)
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుదారుల తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కర్నూలు జిల్లా అదోనిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఏపీలో హిందుత్వవాదం వేళ్లూనుకుంటోందని అన్నారు.

హిందుత్వవాద బీజేపీని నిలువరించకపోతే రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడులు వెనుక ఉన్నది హిందుత్వవాదులేనని ఒవైసీ ఆరోపించారు.
 
ఏపీలో సైలెంట్ గా దూసుకెళుతున్న బీజేపీ... భవిష్యత్తులో చంద్రబాబును ఇంటికే పరిమితం చేయాలని ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్ కారణమని, ముస్లింలే కారకులని ప్రచారం చేశారని మండిపడ్డారు.

కరోనా భారత్ లోనే కాదని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని వెల్లడించారు. డయాబెటిస్, బీపీ, హృదయ సంబంధ వ్యాధులు కిడ్నీ వ్యాధులు కూడా ముస్లింలలోనే ఉన్నాయా?... మిగతావారిలో లేవా? అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments